యూరియా కోసం సిర్పూర్ ఎమ్మెల్యే ఆందోళన ..రైతులతో కలిసి రోడ్డుపై రాస్తారోకో

యూరియా కోసం సిర్పూర్  ఎమ్మెల్యే ఆందోళన ..రైతులతో కలిసి రోడ్డుపై రాస్తారోకో
  • ట్రాఫిక్ లో చిక్కుకున్న 108

కాగజ్ నగర్, వెలుగు: రైతులందరికీ యూరియా ఇవ్వాలని డిమాండ్  చేస్తూ సిర్పూర్  ఎమ్మెల్యే హరీశ్ బాబు సోమవారం కాగజ్‌‌నగర్‌‌లోని వ్యవసాయ మార్కెట్  యార్డ్  ముందు రోడ్డుపై ఆందోళన చేశారు. మార్కెట్  యార్డ్ లోని పీఏసీఎస్​కు వచ్చిన  రైతులతో కలిసి రోడ్డెక్కారు. యూరియా వచ్చాక అందరికీ ఇస్తామని ఏవో రామకృష్ణ చెప్పినా వినలేదు. 

దీంతో రెండు వైపులా ట్రాఫిక్  జామ్  కావడంతో ఎమ్మెల్యే ను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్​ వెహికల్​లోకి ఎక్కించారు. పోలీస్​ వెహికల్​ను రైతులు, మహిళలు అడ్డుకున్నారు. ఈక్రమంలో పెంచికల పేట్  నుంచి గర్భిణిని తీసుకువస్తున్న 108 ట్రాఫిక్​లో చిక్కుకుంది. పోలీసులు, కొందరు యువకులు స్పందించి అంబులెన్స్ కు దారి ఇచ్చేలా ట్రాఫిక్ ను క్లియర్  చేశారు. 108 వచ్చినా ఆందోళన కొనసాగించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.