కాంగ్రెస్​లో చేరిన ఆరుగురు బీఆర్​ఎస్ ​కౌన్సిలర్లు

కాంగ్రెస్​లో చేరిన ఆరుగురు బీఆర్​ఎస్ ​కౌన్సిలర్లు

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు సోమవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారిల ఆధ్వర్యంలో కాంగ్రెస్​లో చేరారు. ఎమ్మెల్యే వినోద్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. బెల్లంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకు పోతోందన్నారు. 

దుర్గం చిన్నయ్య పట్ల విసుగుచెందిన కౌన్సిలర్లు సీఎం రేవంత్ రెడ్డి పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరినట్లు చెప్పారు. కాంగ్రెస్​లో చేరిన వారిలో 2, 4, 10, 18, 22, 34వ వార్డుల కౌన్సిలర్లు షేక్ అఫ్సర్, అస్మా షేక్, కొక్కెర చంద్రశేఖర్, గురుండ్ల లక్ష్మి, గడ్డం అశోక్ గౌడ్, చిట్యాల శ్రీలక్ష్మి ఉన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, కాంగ్రెస్ నాయకులు మునిమంద రమేశ్, చిలుముల శంకర్, కౌన్సిలర్లు బండి ప్రభాకర్ యాదవ్, బొడ్డు నారాయణ, నీలి కృష్ణ, కొమ్ముల సురేశ్, బొడ్డు నారాయణ పాల్గొన్నారు.