జాతీయ స్థాయి వుషూ పోటీలకు ఆరుగురు తెలంగాణ క్రీడాకారుల ఎంపిక

జాతీయ స్థాయి వుషూ పోటీలకు ఆరుగురు తెలంగాణ క్రీడాకారుల ఎంపిక

భైంసా, వెలుగు: ఇటీవల మహబూబ్​నగర్​ జిల్లా నెల్లికోడూరులో నిర్వహించిన ఎస్​జీఎఫ్ఐ అండర్​ -17, 19 క్రీడా పోటీల్లో నిర్మల్​జిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 

అండర్-17లో 36 కేజీల విభాగంలో డి.రాజేశ్వరి (భైంసా), 40 కేజీల విభాగంలో కృష్ణ (బాసర) గోల్డ్​మెడల్​ సాధించారు. 52 కేజీల విభాగంలో యువరాజు(బాసర), 56 కేజీల విభాగంలో రాంచరణ్​(భైంసా), 60 కేజీల విభాగంలో అరవింద్​(బాసర) సిల్వర్ ​మెడల్ ​దక్కించుకు న్నారు. 

వీరు అక్టోబర్​ 27 నుంచి జమ్మూకాశ్మీర్​లోని శ్రీనగర్​లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా క్రీడల అధికారి రవీందర్ ​రెడ్డి తెలిపారు. విద్యార్థులను డీఈవో భోజన్న అభినందించారు.