ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే గుర్తుండిపోవాలి అనుకుంటారు ఎవరైనా. అందుకోసం ప్రత్యేకంగా గిఫ్ట్లు తయారుచేయిస్తుంటారు. అలాగే మనదేశ ప్రధాని మోడీ కూడా.. ఇతర దేశాల వాళ్లకు ఇచ్చే గిఫ్ట్లు కూడా చాలా స్పెషల్గా ఉంటాయి. వాటి గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
మొన్నామధ్య జపాన్ ప్రభుత్వ అధిపతిగా తన మొదటి భారత పర్యటన కోసం కిషిదా మనదేశ రాజధాని ఢిల్లీకి వచ్చారు. అయితే ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ పీఏం ఫుమియో కిషిదకి ఒక గిఫ్ట్ ఇచ్చారు. అది అలాంటిలాంటి గిఫ్ట్ కాదు. చాలా స్పెషల్. దానిపేరు ‘కృష్ణ పంఖి’ (విసనకర్ర). విసనకర్ర చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. దాన్ని రాజస్తాన్లో తయారుచేశారు. పూర్తిగా గంధపు చెక్కతో అద్భుతంగా డిజైన్ చేశారు. అంతేకాదు, ఆ విసనకర్రకి కిటికీ కూడా ఉంది. కిటికీ తలుపు తెరిస్తే, కృష్ణుడి బొమ్మలు కనిపిస్తాయి. అవి కృష్ణుడి ప్రేమ, సున్నితత్వం, కరుణ వంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్న రకరకాల పోజ్లలో ఉంటాయి. ఈ వినసకర్రకి చివర మువ్వలు ఉన్నాయి. విసనకర్ర పై భాగంలో నెమలి బొమ్మ ఉంది. విసనకర్రని నిలబెట్టడానికి కింద స్టాండ్ కూడా ఉంది. రాజస్తాన్లోని ‘చురు’ కళాకారులు ‘జలి’ అనే ట్రెడిషనల్ డిజైన్తో దీన్ని తయారుచేశారు. దీన్ని గంధపు చెక్కతో ఎందుకు తయారుచేశారంటే, ఎన్నో మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నాయి కనుకనే. అంతేకాకుండా దానికి మతపరమైన గుర్తింపు ఉంది కాబట్టి.
గతంలో కూడా...
గతంలో కూడా అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్కి వెరైటీ గిఫ్ట్ ఇచ్చారు. కమలా గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన కొన్ని పేపర్ కటింగ్స్ని చెక్కతో ఫ్రేమ్ కట్టించి, ఇచ్చారు. అదేకాకుండా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్కి ‘గులాబీ మీనాకారి’ గిఫ్ట్గా ఇచ్చారు. అది పూర్తిగాసిల్వర్తో తయారుచేసింది. అందులో కాశీ సౌందర్యం కనిపిస్తుంటుంది. అది చూడ్డానికి నెమలి ఆకారంలో ఉన్న షిప్లా కనిపిస్తుంది. ఇకపోతే జపాన్ మాజీ సౌందర్యం సుగాకి గంధపు చెక్కతో చేసిన బుద్ధుడి విగ్రహం గిఫ్ట్గా ఇచ్చారు. అలాగే.. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహుకి కేరళ నుంచి తెప్పించిన రెండు జతల కాపర్ ప్లేట్లు గిఫ్ట్గా ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, హిమాచలి సిల్వర్ బ్రేస్లేట్, టీ, తేనె, చేత్తో కుట్టిన శాలువాలు గిఫ్ట్గా ఇచ్చారు. ఇలా మనదేశ ప్రధాని ఇతర దేశ నాయకులకు ఇచ్చే గిఫ్ట్లు కూడా చాలా చాలా స్పెషల్.