కాంగ్రెస్ బలోపేతంపై సోనియా కసరత్తు

కాంగ్రెస్ బలోపేతంపై సోనియా కసరత్తు

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. భేటీకి ముందు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. కేవలం పార్టీ కోసమే కాదు.. ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలన్నారు సోనియా గాంధీ. రైతులకిచ్చిన హామీలు కేంద్రం నెరవేర్చేలా కనిపించట్లేదన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావస సరకుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. పార్టీ తదుపరి ప్రచార కార్యక్రమాలు, క్యాంపైయిన్లలో అందరూ బాధ్యతాయుతంగా పాల్గొనాలని కోరారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.

మరిన్ని వార్తల కోసం

కానిస్టేబుళ్లపై కత్తితో దాడి చేసిన యువకుడు

పాడైన వ్యర్థాలతో అద్భుతాలు సృష్టిస్తున్న యువ ఇంజినీర్