మహిళా ఎంపీలతో సెల్ఫీ.. శశిథరూర్ పై ట్రోల్స్

మహిళా ఎంపీలతో సెల్ఫీ.. శశిథరూర్ పై ట్రోల్స్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటారు. తాజాగా మహిళా ఎంపీలతో కలసి ఆయన దిగిన ఓ ఫొటోపై ట్రోల్సింగ్స్ వస్తున్నాయి. వివరాలు.. మహిళా ఎంపీలు సుప్రియా సూలే, ప్రణీత్ కౌర్, తమీజాచి, మిమీ చక్రవర్తి, నుస్రత్ జహాన్, జోతిమణితో కలసి లోక్ సభ ప్రాంగణంలో శశి థరూర్ ఓ ఫొటో దిగారు. 

ఈ ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్న థరూర్.. ‘పని చేయడానికి లోక్ సభ ఆకర్షణీయమైన ప్రదేశం కాదని ఎవరన్నారు?’ అని క్యాప్షన్ జత చేశారు. ఫొటోలో ఉన్న ఆరుగురు ఎంపీల పేర్లను ట్యాగ్ చేశారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున కామెంట్లు రావడంతో ఆయన స్పందించారు. మహిళా ఎంపీలు పిలిస్తేనే తాను సెల్ఫీ దిగానన్నారు. ఫొటోను అదే స్ఫూర్తితో ట్వీట్ చేయాల్సిందిగా వారు చెప్పారని తెలిపారు. ఫొటోను షేర్ చేసినందుకు తాను హ్యాపీగా ఫీలవుతున్నట్లు వివరణ ఇచ్చారు. 

మరిన్ని వార్తల కోసం: 

రాష్ట్రంలో మూడ్రోజులు తేలికపాటి వర్షాలు

బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాష్ట్రమే లెటర్ ఇచ్చింది 

వరంగల్ లో హైటెక్ క్రికెట్ బెట్టింగ్