భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బాల కార్మికులు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ బి. రోహిత్ రాజు పేర్కొన్నారు. ఈ నెల 1 నుంచి 31 వరకు స్మైల్–12 ప్రోగ్రామ్ను చేపడుతున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఎస్పీ ఆఫీస్లో శుక్రవారం జరిగిన ప్రోగ్రామ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, పాల్వంచ, మణుగూరు డివిజన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి స్మైల్ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని కోరారు. షాపులు, హోటల్స్, పరిశ్రమలు, మెకానిక్ షెడ్స్ ల్లో బాలకార్మికులుంటే 100 నెంబర్తో పాటు 1098 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. చిన్న పిల్లలతో బలవంతంగా బిక్షాటన, వెట్టి చాకిరీ చేయించేవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రోగ్రామ్లో ఎస్పీ ఇన్సిపెక్టర్ శ్రీనివాస్, డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్సిపెక్టర్ రాము, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, డీసీపీఓ హరికుమారి, షీ టీమ్ ఎస్సై రమాదేవి పాల్గొన్నారు.
