
వనపర్తి, వెలుగు: జూరాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడానికి ఏర్పాటు చేస్తున్న పోలీస్ అవుట్ పోస్ట్ పనులను క్వాలిటీతో చేపట్టాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశించారు. బుధవారం అవుట్ పోస్ట్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవుట్ పోస్ట్ ఏర్పాటుతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పోలీస్ సేవలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఆత్మకూర్ సీఐ శివకుమార్, అమరచింత ఎస్సై స్వాతి పాల్గొన్నారు.
విజేతలను అభినందించిన ఎస్పీ..
ఉమ్మడి జిల్లా 5 కి.మీ. స్పీడ్ సైకిల్ రేస్లో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ కూతుళ్లను ఎస్పీ అభినందించారు. కానిస్టేబుల్ నాగరాజ్గౌడ్ కూతుళ్లు మనస్వి, జ్ఙాపిక రేస్లో పాల్గొని ఫస్ట్, థర్డ్ ప్లేస్లో నిలిచారు. జిల్లా పోలీస్ ఆఫీస్లో వారికి ఎస్పీ శాలువాలు కప్పి సన్మానించారు. పోలీసుల పిల్లలు వివిధరంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.