ప్రతి ఒక్కరూ ట్రాఫిక్​రూల్స్​ పాటించాలి : ఎస్పీ రూపేశ్​

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్​రూల్స్​ పాటించాలి : ఎస్పీ రూపేశ్​

మునిపల్లి, వెలుగు : వాహనదారులందరూ ట్రాఫిక్ రూల్స్​ పాటించాలని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్​ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని కంకోల్​ టోల్​ ప్లాజా ఆధ్వర్యంలో 35వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను బుధవారం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా ఎస్పీ రూపేశ్​ హాజరయ్యారు. అనంతరం వాహనదారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. వాహనదారులు హెల్మెట్, సీటు బెల్ట్​ తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ రమేశ్​, కొండాపూర్​ సీఐ చంద్రయ్య, సంగారెడ్డి ట్రాఫిక్​ సీఐ సుమన్​ కుమార్​, మునిపల్లి ఎస్​ఐ సురేశ్​ పాల్గొన్నారు.