కర్నాటకలోని రాయచూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు.. బైక్ను, ఇద్దరు విద్యార్థినులను ఢీకొట్టింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డవడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
జులై 18న రద్దీగా ఉండే రాఘవేంద్ర పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన ఈ సంఘటన.. రోడ్డు భద్రతకు సంబంధించిన ఒక హెచ్చరికను జారీ చేస్తుంది. ట్రాఫిక్ను పట్టించుకోకుండా ఎదురుగా వస్తున్న బైకర్ రద్దీగా ఉండే రోడ్డులో అకస్మాత్తుగా U-టర్న్ చేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైకర్కు తీవ్ర గాయాలు కాగా, రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు విద్యార్థినులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుపై మరోసారి చర్చ మొదలైంది. అత్యంత బాధ కలిగించే వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ ఘటనపై రాయచూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.