క్రీడలతో మానసికోల్లాసం : ఎస్పీ వినీత్

క్రీడలతో  మానసికోల్లాసం : ఎస్పీ వినీత్

మహబూబ్ నగర్, వెలుగు: క్రీడలు క్రమశిక్షణ, మానసికోల్లాసాన్ని పెంపొందిస్తాయని నారాయణపేట ఎస్పీ వినీత్  తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పేటలోని స్టేడియం గ్రౌండ్ లో  మెగా క్రికెట్ టోర్నమెంట్​ను ఆయన ప్రారంభించారు. ఈ  ఫ్రెండ్లీ మెగా క్రికెట్  టోర్నమెంట్​లో జిల్లాలోని 30 టీమ్స్ పాల్గొంటుండగా, రెవెన్యూ, పోలీస్, మీడియా, డాక్టర్లు, లాయర్లు సైతం పాల్గొనడం అభినందనీయమన్నారు. డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.