శ్రీలంకలో మరో నెల పాటు ఎమర్జెన్సీ

శ్రీలంకలో మరో నెల పాటు ఎమర్జెన్సీ

ఈస్టర్‌ సండే రోజు శ్రీలంకలో జరిగిన ఆత్మాహుతి దాడులు జరగడంతో అక్కడ అత్యవసర పరిస్థితి విధించింది . ఇప్పటికీ అక్కడ ఉగ్రముప్పు పొంచి ఉండటంతో అత్యవసర  పరిస్థితిని మరో నెల రోజులపాటు పొడిగిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.  దీనికి సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అధికారికంగా ప్రకటించారు. ప్రజా భద్రత చట్టం ప్రకారం వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని మరో నెలరోజుల పాటు అక్కడ అత్యవసర పరిస్థితి కొనసాగనుంది.