ఐర్లాండ్పై శ్రీలంక విజయం

ఐర్లాండ్పై శ్రీలంక విజయం

హోబర్డ్‌‌‌‌: ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొట్టిన శ్రీలంక.. టీ20 వరల్డ్‌‌కప్‌‌లో శుభారంభం చేసింది. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో కుశాల్‌‌ మెండిస్‌‌ (68 నాటౌట్‌‌) రాణించడంతో.. సూపర్‌‌–12, గ్రూప్‌‌–1 మ్యాచ్‌‌లో ఆదివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో లంక 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌‌ చేసిన ఐర్లాండ్‌‌ 20 ఓవర్లలో 128/8 స్కోరు చేసింది. హారి టెక్టర్‌‌ (45), పాల్‌‌ స్టిర్లింగ్‌‌ (34) మినహా మిగతా వారు నిరాశపర్చారు. లంక బౌలర్లలో తీక్షణ, హసరంగ చెరో రెండు వికెట్లు తీశారు.

తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన లంక 15 ఓవర్లలో 133/1 స్కోరు చేసి గెలిచింది. మెండిస్‌‌, ధనంజయ డిసిల్వా (31), అసలంక (31 నాటౌట్‌‌) రాణించారు. మెండిస్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. కాగా, కరోనా పాజిటివ్​గా తేలినా ఐర్లాండ్​ డాక్రెల్​ ప్లేయర్​ ఈ మ్యాచ్​ ఆడాడు.