
తమలాంటి వాళ్లని తక్కువగా చూసే సమాజానికి తమ టాలెంట్ చూపించాలనుకుంది. అది కూడా అందాలపోటీల్లో కిరీటం గెలిచి మరీ చెప్పాలనుకుంది. ఆ రోజు రానే వచ్చింది. ‘మిస్ ట్రాన్స్ గ్లోబల్–2021’ టైటిల్ గెలిచింది. ఈ టైటిల్ సాధించిన మొదటి భారతీయురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. ‘నిత్యం అవమానాలు పడ్డవాళ్లకి, సమాజంలో గౌరవం దక్కనివాళ్లకి ఈ విజయం అంకితం’ అని టైటిల్ గెలిచిన తర్వాత తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఆమె పేరు శృతి సితార. కేరళకు చెందిన ట్రాన్స్జెండర్.
‘‘మేము అందరిలాంటి వాళ్లమే. సమాజంలో మేము కూడా భాగమే. ట్రాన్స్జెండర్లు చాలామంది తమ బాధ చెప్పుకునేందుకు ముందుకు రావట్లేదు. అలాంటివాళ్లకు ధైర్యం చెప్పి, నచ్చినట్టుగా బతికేలా చేస్తాం. ట్రాన్స్ కమ్యూనిటీలో నమ్మకాన్ని పెంచేందుకు ఈ టైటిల్ పనికొస్తుంది. నా సక్సెస్ జర్నీలో అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ”అని చెప్పింది. శ్రుతి కేరళలో సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్గా పనిచేసింది. ఎల్జీబీటీ(లెస్బినియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్జెండర్) హక్కుల కోసం తన ఫ్రెండ్స్తో కలిసి ‘ది కలైడోస్కోప్’ ఆన్లైన్ క్యాంపెయిన్ నడిపిస్తున్న ఈమె మోడల్, ఆర్టిస్ట్ కూడా. ‘మిస్ ట్రాన్స్ గ్లోబల్’ అనేది ట్రాన్స్జెండర్లకి సంబంధించిన ఇంటర్నేషనల్ ఆన్లైన్ అందాల పోటీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ కమ్యూనిటీల హక్కుల గురించి అవేర్నెస్ కల్పించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశం