సినీ కళాకారులంతా తెలంగాణ బిడ్డలే

సినీ కళాకారులంతా తెలంగాణ బిడ్డలే

హైదరాబాద్: తెలంగాణలో ఉన్న సినీ కార్మికులంతా తెలంగాణ బిడ్డలేనని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డితో పాటు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, ఆర్.నారాయణ మూర్తి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ... తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఆడుతోందంటే దానికి కారణం సీఎం కేసీఆర్ అని అన్నారు. సినీ రంగ అభివద్ధికి రాష్ట్రం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రోడు కాదు మనోడని, అలాగే ఇక్కడ ఉంటున్న సినీ కళాకారులందరూ తమ బిడ్డలేనని స్పష్టం చేశారు. చిరంజీవి తన అభిమాన నటుడని చెప్పిన మంత్రి మల్లారెడ్డి... తనతో సినిమా చేయాలనుందని తెలిపారు. కష్టపడి పని చేస్తే ప్రతి ఒక్కరూ గొప్పోళ్లు కావొచ్చని, చిరంజీవి లాంటి వ్యక్తుల జీవితం అందుకు నిదర్శమన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

ఓయూ నేతల పరామర్శకు వెళ్లిన జగ్గారెడ్డి అరెస్ట్

సరిహద్దు వివాదంపై అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు