మహారాష్ట్రలో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మరాఠా రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ జల్నా జిల్లాలో చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనకారులు రాళ్లు రువ్వడంతోపాటు పాలు వాహనాలు తగలబెట్టారు. పోలీసులు బలవంతంగా ఆందోళనకారులను చెదరగొట్టారు. జల్నా జిల్లా తాజా హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంగళవారం (ఆగస్టు29) నుంచి సెంట్రల్ మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో మరాఠా రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం (సెప్టెంబర్1న) నిరాహార దీక్షకు మద్దతుగా నిరసనకారులు ఆందోళన ఉద్రిక్తం చేయడంతో హింసాత్మకంగా పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో పోలీసులతో సహా అనేక మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అంబాద్ తహసీల్పరిధిలోని అంతర్వాలి గ్రామంలో నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్, బాష్పవాయువు షెల్ లను ప్రయోగించారు.
#WATCH | Maharashtra | Stone pelted, vehicle torched during protest demanding Maratha Reservation in Jalna. Police disperse the protesters. pic.twitter.com/W5vilmg9LX
— ANI (@ANI) September 2, 2023