
హైదరాబాద్, వెలుగు: వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, బ్లాక్చెయిన్ సొల్యూషన్స్అందించే స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్ తన 2026 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్వార్టర్లో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.199 కోట్లుగా నమోదైంది. పన్ను తర్వాతి లాభం (పీఏటీ) రూ.18.29 కోట్లుగా ఉంది.
పీఏటీ మార్జిన్ 9.19 శాతం కాగా, ఆపరేటింగ్ఇబిటా 21.83 శాతం కోట్లు ఉందని కంపెనీ తెలిపింది. ఈ ఫలితాలు కంపెనీ ఆర్థిక పనితీరులో స్థిరత్వాన్ని వృద్ధిని సూచిస్తున్నాయని, పెట్టుబడిదారులలో సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయని పేర్కొంది.