
వెలుగు, షాద్ నగర్ : సరిపడా టీచర్లు లేక మంచిగా చదువుకోలేకపోతున్నామని రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం ఏలికట్ట, చౌదర్గూడ మండలం పెద్దఎల్కిచర్ల ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలోని స్టూడెంట్లు శుక్రవారం నిరసనకు దిగారు. ఎలికట్టలో 180 మంది స్టూడెంట్లకు ఆరుగురు టీచర్లు, పెద్దఎల్కిచర్లలో 200కి గాను ఆరుగురు టీచర్లు ఉన్నారు.
రెండు చోట్ల ఇద్దరు, ఇద్దరు టీచర్లు డిప్యుటేషన్పై జిల్లాలోని ఇతర స్కూళ్లకు వెళ్తున్నారు. టీచర్లు లేక క్లాసులు సరిగా జరగడం లేదని స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మౌలిక వసతులతోపాటు టీచర్లను నియమించాలని కోరుతున్నారు.