
ప్రముఖ ఫార్మా స్యూటికల్ సంస్థ సన్ ఫార్మా కరోనా వైరస్ యాంటీ వైరల్ డ్రగ్ ఫావిపిరవిర్ను మార్కెట్ లో విడుదల చేసింది.
తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న కరోనా బాధితుల చికిత్సకు ఫ్లూగార్డ్ పేరుతో లాంచ్ చేసిన ఈ ట్యాబ్లెట్ ను వినియోగించుకోవచ్చని ఆ సంస్థ బిజినెస్ ఇండియా సీఈఓ కీర్తి గానోర్కర్ తెలిపారు. 200 మిల్లీగ్రాములున్న ఒక్కో టాబ్లెట్ ధర రూ.35 ప్రకటించారు.
ఈ సందర్భంగా కీర్తి గానోర్కర్ మాట్లాడుతూ దేశంలో ప్రతీ రోజు 50వేల కరోనా కేసులు నమోదవుతున్నాయని, వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తమ వంతు పాత్ర పోషించేందుకు ఈ టాబ్లెట్ ను అందుబాటులోకి తెచ్చారన్నారు. ప్రజలపై ఆర్ధిక భారాన్ని తగ్గిస్తూ మరింత మంది రోగులకు ఈ ట్యాబ్లెట్ అందేలా తక్కువ ధర నిర్ణయించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా రోగులకు ఫ్లూగార్డ్ ట్యాబ్లెట్లను అందించేందుకు తమ సంస్థ కేంద్రం, మెడికల్ కమ్యూనిటీతో కలిసి పనిచేస్తున్నట్లు సన్ ఫార్మా సీఈఓ కీర్తి గానోర్కర్ వెల్లడించారు