గురుగ్రామ్: బాలీవుడ్ యాక్టర్ సునీల్ షెట్టి రీ–ఇంజినీర్డ్ టైర్ స్టార్టప్ రీగ్రిప్లో పెట్టుబడి పెడుతున్నట్లు శనివారం ప్రకటించారు. వేస్ట్ తగ్గించడమే కాకుండా, టైర్ల లైఫ్సైకిల్ పెరిగేలా చూసే ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడం ఎక్సయిట్మెంట్ కలిగిస్తోందని సునీల్ షెట్టి ఈ సందర్భంగా వెల్లడించారు. సేఫ్టీ ఉండేలా హై క్వాలిటీ టైర్లను ఈ స్టార్టప్ తయారు చేస్తుంది. ఇన్నొవేషన్, సస్టెయినబుల్ ప్రాక్టీసులతో భవిష్యత్తరాల కోసం బెటర్ వరల్డ్ క్రియేట్ చేయగలుగుతామని షెట్టి పేర్కొన్నారు.
రీఫర్బిష్డ్ టైర్ల బ్రాండ్లో పెట్టుబడులు విన్ విన్ సొల్యూషన్గా ఈ స్టార్టప్లో మొదటి పెట్టుబడిదారుడయిన మహావీర్ ప్రతాప్ శర్మ చెప్పారు. సర్క్యూలర్ ఎకానమీ సూత్రాలను తాము నమ్మడంతో పాటు, ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తామని రీగ్రిప్ ఫౌండర్ తుషార్ సుహాల్క వెల్లడించారు. జర్నీ ఇప్పుడే మొదలైందని, కానీ చాలా కాలం పాటు తమ ప్రభావం ఉండేలా పనిచేస్తామని వివరించారు. క్వాలిటీ గ్రేడ్ రబ్బర్తో రీఫర్బిష్డ్ టైర్లను ఈ స్టార్టప్ కంపెనీ రీగ్రిప్ మాన్యుఫాక్చర్ చేస్తుంది. షీరింగ్, రీట్రెడింగ్ ప్రాసెస్ల ద్వారా టైర్లను తయారు చేస్తామని సుహాల్క చెప్పారు. కొత్త ప్రొడక్టుల రేట్ల ధరలో సగానికే తమ టైర్లు దొరుకుతాయని, చిన్న మీడియం ట్రక్కింగ్ కంపెనీలు తమ ప్రొడక్టులు వాడతాయని సుహాల్క పేర్కొన్నారు.