- రాకపోయినా ...తీర్పు ఇచ్చేస్తాం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: విజయ్ మాల్యాపై కోర్టు ధిక్కరణ కేసును సుప్రీం కోర్టు ఈ నెల 24 వ తేదీకి వాయిదా వేసింది. వ్యక్తిగతంగా లేదా తన లాయర్ ద్వారా తన ముందు హాజరవడానికి రెండు వారాల గడువు ఇచ్చింది. ఒకవేళ ఆయన కోర్టుకు హాజరు కాకపోయినా, తీర్పు ఇవ్వనున్నట్లు సుప్రీం కోర్టు గురువారం నాడు స్పష్టం చేసింది. బ్యాంకులను మోసగించడంతోపాటు, మనీలాండరింగ్ ఆరోపణలూ ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా యూకేకి పారిపోయిన విషయం తెలిసిందే. ఆ దేశంలోనూ బెయిల్పైనే విజయ్ మాల్యా ఉంటున్నారు. ఈ కింగ్ఫిషర్ మాజీ బాస్ గత ఐదేళ్లుగా బ్రిటన్లోనే తలదాచుకున్నారు. లండన్లోని విజయ్ మాల్యా లగ్జరీ నివాసాన్ని స్వాధీనం చేసుకోవచ్చంటూ బ్యాంకుకు అక్కడి కోర్టు ఇటీవలే అనుమతి ఇచ్చింది. విజయ్ మాల్యాను ఇండియాకు తిరిగి పంపేయడానికి తగిన ఉత్తర్వులను యూకే ప్రభుత్వం 2019 లోనే జారీ చేసింది. అప్పటి నుంచీ యూకే కోర్టులలో కేసులు వేయడం ద్వారా ఆ ప్రక్రియను మాల్యా జాప్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఆ దారులన్నీ దాదాపుగా మూసుకుపోవడంతో, చిట్టచివరి ప్రయత్నంగా రాజకీయ ఆశ్రయం కావాలంటూ బ్రిటన్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నట్లు సమాచారం.