నిందితుడికి సహకరించిన సీఐ సస్పెన్షన్

నిందితుడికి సహకరించిన సీఐ సస్పెన్షన్

నాగర్ కర్నూల్, వెలుగు : నాగర్  కర్నూల్  జిల్లాలో సంచలనం సృష్టించిన 11 మంది సీరియల్  హత్య కేసులో నిందితుడు రామాటి సత్యనారాయణకు సహకరించిన పాత సీఐ జక్కుల హన్మంతును మల్టీ జోన్–-2 ఐజీ తరుణ్ జోషి సస్పెండ్  చేశారు.

నాగర్ కర్నూల్  పోలీస్ స్టేషన్ లో నమోదైన మర్డర్  కేసులో నిందితుడికి సీఐ సహకరించినట్లు విచారణలో తేలిందని ఓ ప్రకటనలో ఐజీ తెలిపారు. జక్కుల హనుమంతు ప్రస్తుతం సంగారెడ్డిలో పనిచేస్తున్నారు. మాయలు, మంత్రాలు, గుప్తనిధుల ముసుగులో 11 మందిని రామాటి సత్యనారాయణ హత్య చేసిన విషయం తెలిసిందే.