ప్రతి ఒక్కరికి రూ.26 వేలు.. తైవాన్ ప్రభుత్వం ఏఐ నజరానా

ప్రతి ఒక్కరికి రూ.26 వేలు..  తైవాన్ ప్రభుత్వం ఏఐ నజరానా

తైపే: ప్రపంచవ్యాప్తంగా ఏఐ, హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్  క్లౌడ్ సర్వీసెస్ రంగాల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా తైవాన్ ఖజానా కళకళలాడుతోంది. ఇక్కడి ​కంపెనీలు పెద్ద ఎత్తున విదేశాలకు చిప్స్​ను ఎగుమతి చేస్తున్నాయి.   దీంతో ఈ చిన్న దేశం జేబు నిండిపోయింది.

భారీగా మొత్తాన్ని తన ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.  వచ్చే ఏడాది ప్రతి పౌరుడికి  10 వేల తైవాన్​ డాలర్ల (దాదాపు రూ.26 వేలు) చొప్పున ఇవ్వనుంది. ఇందుకోసం 7.4 బిలియన్​ డాలర్లు (దాదాపు రూ.6.12 లక్షల కోట్లు) కేటాయించనుంది. ఏఐ కారణంగా తైవాన్​ ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తోంది.

ఈ బలమైన వృద్ధి నేపథ్యంలో 2026 ఆర్థిక వృద్ధి అంచనాలను ప్రభుత్వం 11 శాతానికి పెంచింది.  ఆదాయం భారీగా పెరగడంతో పాటు బడ్జెట్ నిల్వలు మెరుగ్గా ఉన్నాయి. అదనపు రుణాలు తీసుకోకుండానే ఈ నగదును ప్రజలకు పంచనుంది,