న్యూ ఢిల్లీ: హీరోయిన్ తమన్నా భాటియా తల్లిదండ్రులకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని తమన్నా స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత వారం రోజుల నుంచి తన తల్లిదండ్రుల్లో స్వల్పంగా కొవిడ్ లక్షణాలు కనిపించాయని.. దీంతో ఫ్యామిలీ అంతా ముందస్తు జాగ్రత్తలు పాటించామని వెల్లడించింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇంట్లోనే ఉంటూ కొవిడ్ పరీక్షలు చేయించుకున్నామని తెలిపింది. అయితే, ఆ పరీక్షా ఫలితాలు ఇప్పుడే వచ్చాయని.. దురద్రుష్టవశాత్తూ తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పింది. అయితే, తనతో సహా స్టాఫ్, మిగతా కుటుంబసభ్యులెవరికీ వైరస్ సోకలేదని పేర్కొంది.
వెంటనే అధికారులకు తమ పరిస్థితులను వివరించామని, డాక్టర్లు, అధికారుల సాయంతో చికిత్స కొనసాగిస్తున్నామని తెలిపారు తమన్నా. దేవునిదయ వల్ల తన పేరెంట్స్ కోలుకొంటున్నారని.. అందరి ఆదరాభిమానాలతో తన తల్లిదండ్రులు కరోనా నుంచి బయటపడతారని ఆశాభావం వ్యక్తం చేసింది.