ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి

ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి

తమిళనాడు సీఎం స్టాలిన్ పరిపాలనతో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారు. చెన్నైలోని సిటీ బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు బస్సులో నిలబడి కొద్దిదూరం జర్నీ చేశారు. ప్రయాణికులు, కండక్టర్ తో మాట్లాడారు. సిటీ బస్సుల్లో ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏడాది క్రితం ప్రభుత్వం బస్సుల్లో కల్పించిన మౌలిక వసతులు, ఫిట్ నెస్ పై ఆరా తీశారు. ఇప్పుడ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

మరిన్ని వార్తల కోసం

ధాన్యం లెక్కలు చూపని మిల్లుల నుంచి రైస్ తీసుకోం

అంబులెన్స్​ టైంకు వస్తలే