
అయిజ, వెలుగు: గట్టు మండలం తప్పెట్ల మొర్సు గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే రైతు వడ్లను గట్టులోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో అమ్మాడు. ఆ వడ్లను గట్టులోని ఓ రైస్ మిల్లుకు కేటాయించగా, మిల్లర్ వడ్లను అన్ లోడ్ చేసుకోలేదు. దీంతో న్యాయం చేయాలంటూ వడ్ల ట్రాక్టర్ తో కలెక్టరేట్కు బయలుదేరాడు.
విషయం తెలుసుకున్న కలెక్టర్ సంతోష్ మిల్లర్ తో మాట్లాడి వడ్లు తీసుకోవాలని ఆదేశించారు. రైతు మిల్లుకు వెళ్లి వడ్లు అన్ లోడ్ చేశాడు.