
కమర్షియల్ వెహికల్స్ తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఇంట్రా వీ70, ఇంట్రా, వీ20 గోల్డ్, ఏస్హెచ్టీ ప్లస్ ట్రక్కులను తీసుకొచ్చింది. ఈ కొత్త వెహికల్స్ ఎక్కువ దూరాలకు ఎక్కువ పేలోడ్లను మోసుకెళ్తాయని కంపెనీ తెలిపింది.
పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అధిక లాభాలను, ఉత్పాదకతను అందిస్తాయని పేర్కొంది. ఇంట్రా వీ70 పేలోడ్ 1,700 కేజీలు కాగా, ఇంట్రా వీ20 గోల్డ్ పేలోడ్ 1,200 కిలోలు. ఏఎస్హెచ్టీ ప్లస్పేలోడ్ 900 కిలోలు. వీటి బుకింగ్లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టాటా మోటార్స్ సీబీ డీలర్షిప్లలో మొదలయ్యాయి.