డిసెంబర్లో బంగ్లాదేశ్లో పర్యటించనున్న టీమిండియా

డిసెంబర్లో బంగ్లాదేశ్లో పర్యటించనున్న టీమిండియా

ఢాకా: టీ 20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. డిసెంబర్ 4న మొదలయ్యే ఈ టూర్లో బంగ్లాతో 2 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. ఈ మేరకు బంగా క్రికెట్ బోర్డు (బీసీబీ) షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఢాకాలోని మిర్పూర్ స్టేడియంలో 4, 7, 10న వరుసగా మూడు వన్డేలు జరుగుతాయి. తర్వాత డిసెంబ ర్ 14 నుంచి 18 వరకు చిట్టగాంగ్లో తొలి టెస్ట్, 22 నుంచి 26 వరకు ఢాకాలో రెండో టెస్ట్ ఆడనున్నాయి.

వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ నేపథ్యంలో... ఈ రెండు టెస్ట్లులు ఇ రుజట్లకు చాలా కీలకం కానున్నాయి. ప్రస్తుతం డబ్ల్యూ టీసీలో ఇండియా నాలుగో ప్లేస్లో ఉంది. 2015లో చివరిసారి బంగ్లాలో పర్యటించిన ఇండియా 1-2తో వన్డే సిరీస్ ను చేజార్చుకోగా, ఇరుజట్ల మధ్య జరిగిన ఏకైక టె స్ట్ డ్రాగా ముగిసింది.