
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ సోమవారం తమిళనాడులో పర్యటించనున్నారు. శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయాన్ని సీఎం సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి
బయల్దేరి మధ్యాహ్నం 2.10కి టెంపుల్ కు చేరుకోనున్నట్లు సీఎంవో వెల్లడించింది. సాయంత్రం 6.10కి చెన్నై చేరుకొని ఐటీసీ హోటల్లో బస చేస్తారని తెలిపింది. తిరిగి హైదరాబాద్కు ఎప్పుడు
వస్తారన్నది ఇంకా ఖరారు కాలేదని పేర్కొంది. అయితే ఈ టూర్ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.