అప్పుల బాధతో తెలంగాణ రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో తెలంగాణ రైతు ఆత్మహత్య

మహబూబాబాద్​అర్బన్​, వెలుగు :  మహబూబాబాద్ నడివాడలో అప్పుల బాధ తట్టుకోలేక  పెదగాని ఉపేందర్​(40)అనే  రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  రైతు పెదగాని ఉపేందర్​కు 30గుంటల పొలం ఉంది. గత రెండేండ్లుగా సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర రాక అప్పులు పాలయ్యాడు. ఇల్లు కట్టేందుకు కొంత అప్పు చేశాడు.  ప్రైవేట్​ చిట్టీల పేరిట రూ.2లక్షలు పైగా పోగొట్టుకున్నాడు. దీంతో మొత్తం రూ.10లక్షలకు పైగా అప్పు అయింది. దీంతో మనస్తాపానికి గురైన ఉపేందర్​ సోమవారం  ఇంట్లో ​ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. భార్య అనితకు ఫోన్​ చేసి చెప్పడంతో ఆమె వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఉపేందర్​కు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.