- 9వేల కిట్ల పంపిణీ
- ఒక్క డోసు వేసుకోని 12 వేల మంది గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో ఫీవర్ సర్వేలో భాగంగా ఒక్క డోసు కూడా వ్యాక్సిన్ తీసుకోని వాళ్లలోనే కొవిడ్ సింటమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ వేసుకోకుండా నిర్లక్ష్యం ఉన్నవారిలోనే థర్డ్వేవ్లో భాగంగా జ్వరం, జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్ తీవ్రంగా ఉంటున్నాయి. 3 రోజులుగా ఫీవర్సర్వే కొనసాగుతుండగా, ఆదివారం నాటికి లక్షా70 వేల ఇండ్లకు హెల్త్స్టాఫ్వెళ్లి వివరాలు సేకరించారు. ఇందులో 9 వేల మందికి కరోనా సింటమ్స్ ఉండడంతో హోమ్ ఐసోలేషన్ కిట్లను అందించారు. ప్రతి ఇంటికి వెళ్లి హెల్త్ కండీషన్ చెక్ చేసి వ్యాక్సినేషన్ సమాచారం కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం సింప్టమ్స్ కనిపిస్తున్న వారిలో చాలా మంది వ్యాక్సిన్ తీసుకోని వారే ఉన్నట్లు గుర్తిస్తున్నారు. ఫస్ట్డోస్, రెండో డోస్ వేసుకోని వారితో పాటు రెండు డోస్లు వ్యాక్సిన్ తీసుకొని ఆరునెలలు దాటిన వారిలోనూ సింటమ్స్ఎక్కువగా కనిపిస్తుండగా 40 శాతానికిపైగా వీరే ఉంటున్నారు. రెండో డోస్ తీసుకోని వారితో పాటు రెండు డోసుల వ్యాక్సిన్వేయించుకుని ఆరునెలలు దాటిన వారు 50 శాతం ఉంటుండగా మిగతావారు 10 శాతం ఉన్నారు. 15 ఏండ్లు పైబడి,18 ఏండ్లు పైన ఉన్నవారు కూడా వ్యాక్సిన్తీసుకోని కేటగిరీలో ఉన్నారు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 12 వేల మంది ఫస్ట్డోస్ తీసుకోలేదని తేలింది.
ఇప్పటివరకు 9 వేల కిట్లు పంపిణీ
ఫీవర్ సర్వేలో భాగంగా ఇప్పటివరకు 9 వేల మందిలో సింటమ్స్గుర్తించి హోమ్ ఐసోలేషన్ మెడిసిన్కిట్లను పంపిణీ చేశారు. హైదరాబాద్లోనే లక్షా15, 111 ఇండ్లలో సర్వే చేయగా, పూర్తయ్యే వరకు కొనసాగనుంది. గ్రేటర్లోని జనాభా పూర్తయ్యే వరకు సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు చెప్తున్నారు. హెల్త్స్టాఫ్ కూడా కొవిడ్బారిన పడుతుండగా కొన్నిచోట్ల సర్వే లేటవుతుంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సర్వే స్లోగా ఉంది. ఉన్నతాధికారులు కూడా సరిగా ఫోకస్ చేయడంలేదు. మేడ్చల్జిల్లాకి సంబంధించిన వివరాలు కూడా చెప్పేందుకు జిల్లా వైద్యాధికారి ఇంట్రెస్ట్చూపడం లేదంటే సర్వే ఎలా చేస్తున్నారో తెలుస్తోంది.
దవాఖానలకు పోని వారే ..
కొవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నవారిలో చాలా మంది డాక్టర్లను సంప్రదిస్తున్నారు. డాక్టర్ల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ మెడిసిన్వేసుకుంటున్నారు. ఇంకొందరిలో లక్షణాలు ఉన్న కూడా హాస్పిటల్స్కి వెళ్లకుండా ఇంట్లోనే సొంతంగా మెడిసిన్వాడుతున్నారు. మరికొందరు ఎలాంటి మందులు వాడడం లేదని సర్వేలో తెలుస్తోంది. ప్రస్తుతం ఫీవర్ సర్వేలో గుర్తించిన వారిలో ఇలాంటి వారే ఎక్కువగా ఉన్నారు. జ్వరం దానంతట అదే తగ్గిపోతుందన్న నిర్లక్ష్యంతో మెడిసిన్వాడడంలేదని వెల్లడైతుంది. ఫీవర్ సర్వేలో ఇంటింటికి వెళ్లి మెడిసిన్కిట్ఇస్తే తీసుకుంటుండగా, లక్షణాలు ఉన్నవారు మస్ట్గా మెడిసిన్వాడాలని లేదంటే, ఇంట్లోని మిగతా కుటుంబసభ్యులకు సోకే అవకాశం ఉంటుందని మెడికల్ఆఫీసర్లు సూచిస్తున్నారు.
హైదరాబాద్ జిల్లాలో 3 రోజుల్లో గుర్తింపు ఇలా... సంఖ్య
18 ఏండ్లు పైడి ఫస్ట్ డోస్ తీసుకోని వారు 7,382
15 ఏండ్లు పైడి ఫస్ట్ డోస్ కూడా వేయించుకోని వారు 4,615
సెకండ్ డోస్ తీసుకోని వారు 12,180
బూస్టర్ డోస్ తీసుకోని వారు 1,432