విజయకాంత్‌ మృతి పట్ల తెలంగాణ గవర్నర్ సంతాపం

విజయకాంత్‌ మృతి పట్ల తెలంగాణ గవర్నర్ సంతాపం

తమిళ నటుడు, డీఎండీకే చీఫ్ విజయకాంత్ మృతి పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆమె తమిళ్ లో ట్వీట్ చేశారు.  విజయకాంత్‌ మృతి చెందారనే వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు.  మంచి ఫిల్మ్ మేకర్...మంచి రాజకీయ నాయకుడు...మంచి మనిషి... మంచి అన్నయ్య...మొత్తానికి మనం ఒక మంచి మనిషిని కోల్పోయాం. సోదరుడు విజయకాంత్‌ కుటుంబానికి, ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అని తమిళిసై సంతాపం తెలిపారు. 

 కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయకాంత్..  చెన్నైలోని మియాట్‌ ఇంటర్నేషనల్‌ ఆసుపత్రిలో చికిత్స  పొందుతూ 2023 డిసెంబర్  28 ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. విజయకాంత్ వయస్సు 71 ఏళ్లు.. నాలుగేళ్ల క్రితం పక్షవాతం రావటంతో మంచానికే పరిమితం అయ్యారు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. విజయకాంత్ మృతి పట్ల తమిళనాడు  సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.