ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.  మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లే-అవుట్ ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించింది . దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో 20లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు లబ్ధి చేకూరనుంది.

ALSO READ :- స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పై అప్రమత్తంగా ఉండండి: సెబీ మెంబర్ అలర్ట్

2020 లో దరఖాస్తులకు ఆహ్వానించింది  గత బీఆర్ఎస్  ప్రభుత్వం.  25 లక్షలకు పైగ దరఖాస్తులు వచ్చాయి. కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ప్రక్రియ ఆగిపోయింది.