గెస్ట్ లెక్చరర్లపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు

గెస్ట్ లెక్చరర్లపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు

హైదరాబాద్ : గెస్ట్ లెక్చరర్లపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పని చేసిన 1654 మంది గెస్ట్ లెక్చరర్లను రెన్యూవల్ చేసి.. విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. ఇంటర్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గెస్ట్ లెక్చరర్లను తొలగిస్తూ.. కొత్త వారి నియామకం కోసం జులై 19న ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో పని చేసిన 20 మంది  గెస్ట్ లెక్చరర్లు.. ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ హై కోర్టును ఆశ్రయించారు. గత 10 సంవత్సరాల నుండి పని చేస్తున్న వారిని తొలగించడం కరెక్ట్ కాదని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అదేశాలు ఇచ్చింది హైకోర్టు.