భోలా నాథ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ రూ. 25 లక్షలు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేసిండు..

భోలా నాథ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌  రూ. 25 లక్షలు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేసిండు..

న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌‌‌‌‌‌‌‌ఐ)లో మరో వివాదం చోటు చేసుకుంది. స్టేట్‌‌‌‌‌‌‌‌ ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించడానికి అనుమతి ఇచ్చేందుకు హెచ్‌‌‌‌‌‌‌‌ఐ సెక్రటరీ జనరల్‌‌‌‌‌‌‌‌ భోలా నాథ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ రూ. 25 లక్షలు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశాడని తెలంగాణ హాకీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ సరళ్‌‌‌‌‌‌‌‌ తల్వార్‌‌‌‌‌‌‌‌ ఆరోపించాడు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సరళ్‌‌‌‌‌‌‌‌.. హెచ్‌‌‌‌‌‌‌‌ఐ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ దిలీప్‌‌‌‌‌‌‌‌ టిర్కీకి ఓ లేఖ రాశారు. ‘ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో స్టేట్‌‌‌‌‌‌‌‌ హాకీ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌కు ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌ జరగాల్సి ఉన్నాయి. 

వాటిని నిర్వహించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ హాకీ ఇండియాలోని ఓ అధికారి దానిని అడ్డుకున్నాడు. మాపై ఫిర్యాదులు ఉన్నాయని హెచ్‌‌‌‌‌‌‌‌ఐ తెలిపింది. వాటికి సరైన వివరణ కూడా ఇచ్చాం. చివరకు నేను భోలా నాథ్‌‌‌‌‌‌‌‌ను కలిశా. ఇందులో నుంచి బయటపడి ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించుకోవాలంటే రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. నవంబర్‌‌‌‌‌‌‌‌ 3న ఈ సంఘటన జరిగింది. అన్ని ఆలోచించుకుని వారం రోజుల్లో ఒక నిర్ణయానికి రావాలని చెప్పాడు’ అని సరళ్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే రెండుసార్లు టిర్కీ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారం లభించలేదన్నాడు. త్వరలోనే దీనిపై చర్యలు తీసుకుంటాడని ఆశిస్తున్నట్లు సరళ్‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు.