హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో ఫుడ్, డ్రింక్స్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న 'ఫుడ్ ఎ’ఫెయిర్ 2025' రెండో ఎడిషన్ హైదరాబాద్లోని హైటెక్స్లో ప్రారంభమైంది. ఈ ఫెయిర్ నవంబర్ ఆదివారమూ కొనసాగుతుంది. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రిటైలర్లు, టెక్నాలజీ ఇన్నోవేటర్లు, చెఫ్లు, వివిధ పారిశ్రామిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ ఫెయిర్ లక్ష్యం. ఈ సంవత్సరం కొత్తగా 'ఫుడ్ ఎ’ఫెయిర్ కలినరీ కార్నర్ ను ఏర్పాటు చేశారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న చెఫ్లు లైవ్ డెమోలు, టేస్టింగ్ సెషన్లను నిర్వహిస్తున్నారు. ఆహార పరిశ్రమలలో ఆవిష్కరణ, మార్కెట్ యాక్సెస్ మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఈ ఫెయిర్ కృషి చేస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి సారించి, రాష్ట్రానికి లీడింగ్ హబ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
