తెలంగాణలో మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు

తెలంగాణలో మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. నిన్న 3,603 కేసులు నమోదుకాగా.. ఇవాళ ఆ సంఖ్య మరింత పెరిగింది. గడిచిన 24 గంటల్లో 97,113మందికి పరీక్షలు నిర్వహించగా.. 3,980మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,439 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఈ రోజు 2,398 మంది కరోనా వైరస్ నుంచి కోలుకోగా.. ముగ్గురు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.55శాతంగా ఉండగా.. రికవరీ రేటు 94.89శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 33,673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

For more news

ఐఏఎస్ రూల్స్ మార్పుపై ప్రధానికి కేసీఆర్ లేఖ

యూపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్