
హైదరాబాద్, వెలుగు : డాక్టర్లుగా చెప్పుకునే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు పెడ్తామని తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ హెచ్చరించింది. పేరుకు ముం దు ‘డాక్టర్’ పెట్టుకున్నా.. హాస్పిటల్ అని రాసి ఉన్న బోర్డులు డిస్ప్లే చేసినా, పేషెంట్లకు మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసినా, మెడిసిన్ అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పింది. జూబ్లీహిల్స్లోని సురక్షిత క్లినిక్పై మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ టీమ్ ఇటీవల దాడి చేసింది.
కె.మహేశ్ అనే ఆర్ఎంపీ క్లినిక్ను నడిపి స్తున్నట్టు గుర్తించింది. డాక్టర్గా చెప్పుకుంటూ, పేషెంట్లకు యాంటిబయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటి షెడ్యూల్డ్ డ్రగ్స్ను ప్రిస్క్రైబ్ చేస్తున్నట్టు గుర్తించారు. మహేశ్పై జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు బుక్ చేయించారు. ఐపీసీ 420, మెడికల్ కౌన్సిల్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.