వ్రితి అగర్వాల్ కి ఐదో మెడల్

వ్రితి అగర్వాల్ కి ఐదో  మెడల్

హైదరాబాద్,వెలుగు: గోవా నేషనల్ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ యంగ్ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ అద్భుత పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో ఐదో మెడల్‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన విమెన్స్  400 మీటర్ల ఫ్రీస్టయిల్ లో  వ్రితి 4 నిమిషాల 30.03 సెకండ్ల టైమింగ్‌‌‌‌‌‌‌‌తో రెండో స్థానంతో సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచింది. ఢిల్లీ స్విమ్మర్  భవ్య  (4:27.93సె) గోల్డ్ నెగ్గగా, కర్నాటకకు చెందిన  శిరీన్ (4:34.74సె.) బ్రాంజ్ సొంతం చేసుకుంది.  ఇక విమెన్స్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌లో శ్రీవల్లి రష్మిక–శ్రావ్య శివాని జోడీ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. సెమీఫైనల్లో  ఈ జోడీ  6–-4 , 6–-7 (5/7) , 10–-5తో శర్మదా–సోహా (కర్నాటక)ను ఓడించింది. సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో రష్మిక, శివాని సెమీస్​ చేరుకున్నారు.