
హైదరాబాద్, వెలుగు: నేషనల్ గేమ్స్లో తెలంగాణ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ మరో మెడల్ సాధించింది. విమెన్స్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో సిల్వర్ నెగ్గింది. సోమవారం జరిగిన ఫైనల్లో విత్రి 9 నిమిషాల 14.58 సెకండ్లతో రెండో ప్లేస్లో నిలిచింది. స్నూకర్– బిలియర్డ్స్లో రాష్ట్ర ప్లేయర్ ముస్తాక్ ఖాన్ 15 రెడ్ స్నూకర్ విభాగంలో సిల్వర్ గెలిచాడు.
హోరాహోరీగా సాగిన ఫైనల్లో అతను 2–3తో ఉత్తర్ ప్రదేశ్ ఆటగాడు పరాస్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఫెన్సింగ్లో లోకేష్, పవన్, మురళి, వంశీ లతో కూడిన తెలంగాణ టీమ్ యిపీ విభాగంలో మూడో ప్లేస్తో బ్రాంజ్ గెలిచింది.