
హైదరాబాద్, వెలుగు: నేషనల్ గేమ్స్లో తెలంగాణ విమెన్స్ 3x3 బాస్కెట్బాల్ టీమ్ గోల్డ్ మెడల్ గెలిచింది. గోవాలోని మనోహర్ పారికర్ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో పుష్ప, ప్రియాంక, అంబురాసి, గులాబ్ తో కూడిన తెలంగాణ 21-17 తో ఢిల్లీని ఓడించి విజేతగా నిలిచింది.