ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్‌‌‌‌‌‌‌‌ లో తెలుగు టైటాన్స్‌‌‌‌‌‌‌‌ ఓటమి

ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్‌‌‌‌‌‌‌‌ లో తెలుగు టైటాన్స్‌‌‌‌‌‌‌‌ ఓటమి

అహ్మదాబాద్ :  ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్‌‌‌‌‌‌‌‌ను తెలుగు టైటాన్స్ ఓటమితో ఆరంభించింది. శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గుజరాత్ జెయింట్స్ 38–32తో తెలుగు టైటాన్స్‌‌‌‌‌‌‌‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో జెయింట్స్ రైడర్ సోను 11 టచ్ పాయింట్లతో సత్తా చాటగా, రాకేష్ 5 టచ్ పాయింట్లతో చెలరేగాడు.  ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్లు రోహిత్, నబీబక్ష్​ నాలుగేసి పాయింట్లు రాబట్టగా, కెప్టెన్​ ఫజెల్ అత్రాచలి మూడు ట్యాకిల్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు.

టైటాన్స్ తరఫున కెప్టెన్, స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ 11 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. రజనీశ్, సంజీవి ఐదేసి​ పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్​లో యు ముంబా34–31 తో యూపీ యోధాస్​ను ఓడించింది.