అహ్మదాబాద్ : ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ను తెలుగు టైటాన్స్ ఓటమితో ఆరంభించింది. శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 38–32తో తెలుగు టైటాన్స్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జెయింట్స్ రైడర్ సోను 11 టచ్ పాయింట్లతో సత్తా చాటగా, రాకేష్ 5 టచ్ పాయింట్లతో చెలరేగాడు. ఆల్రౌండర్లు రోహిత్, నబీబక్ష్ నాలుగేసి పాయింట్లు రాబట్టగా, కెప్టెన్ ఫజెల్ అత్రాచలి మూడు ట్యాకిల్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు.
టైటాన్స్ తరఫున కెప్టెన్, స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ 11 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. రజనీశ్, సంజీవి ఐదేసి పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్లో యు ముంబా34–31 తో యూపీ యోధాస్ను ఓడించింది.