రాష్ట్రంలో మరింత పెరగనున్న ఎండలు

రాష్ట్రంలో మరింత పెరగనున్న ఎండలు

రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో రానున్న 5 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. ఈ 5 రోజుల్లో ఉష్ణోగ్రత మరో 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. మరోవైపు రానున్న 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వెల్లడించింది. విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ప్రస్తుతం అది విదర్భ నుంచి ఇంటీరియల్ కర్నాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సముద్రమట్టం నుంచి దాదాపు 0.9కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తల కోసం..

సమతామూర్తి దర్శనానికి 4 రోజులు బ్రేక్

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ హత్య కుట్ర భగ్నం!