ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి : ఆశా వర్కర్లు కార్యకర్తలు

 ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి : ఆశా వర్కర్లు  కార్యకర్తలు

నుమకొండ సిటీ, వెలుగు: తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేల ఇండ్లను ఆశా కార్యకర్తలు  ముట్టడించారు. మంగళవారం హనుమకొండలోని ప్రభుత్వ చీఫ్​ విప్​, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్​, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇండ్లను ముట్టడించే ప్రయత్నం చేశారు.  పోలీసులు వారిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు రూ.18 వేల కనీస ఫిక్స్ డ్​ వేతనం ఇవ్వాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని,  హెల్త్ కార్డులతో పాటు 5 లక్షల బీమా సదుపాయం డిమాండ్​ చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాగుల రమేశ్​, బొట్ల చక్రపాణి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.