థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా తొలి పోరు

థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా తొలి పోరు
  • విమెన్స్ హాకీ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెడ్యూల్ విడుదల
  • సెప్టెంబర్‌ 5 నుంచి మెగా టోర్నీ

ఆసియా కప్‌‌‌‌‌‌ విమెన్స్ హాకీ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా అమ్మాయిలు థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టుతో తమ పోరు ఆరంభించనున్నారు. సెప్టెంబర్ 5న మొదలయ్యే ఈ టోర్నీలో తొలి రోజు ఇండియా– థాయ్‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌ జట్లు పోటీ పడతాయి. ఆ తర్వాత డిఫెండింగ్ చాంపియన్ జపాన్ (సెప్టెంబర్ 6), సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సెప్టెంబర్ 8) తో ఇండియా తలపడనుంది. ఈ మేరకు హాకీ ఇండియా బుధవారం షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటించింది. 

గత ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంస్య పతకం సాధించిన ఇండియా  ఈసారి జపాన్, థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్, సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి పూల్– బిలో బరిలో నిలిచింది. పూల్–ఎలో ఆతిథ్య చైనా, కొరియా, మలేసియా, చైనీస్ తైపీ జట్లు ఉన్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 5 నుంచి 14 వరకు చైనాలోని హాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జౌలో జరగనుంది. విజేతగా నిలిచే జట్టు 2026  హాకీ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నేరుగా క్వాలిఫై అవుతుంది.   ప్రతీ పూల్ నుంచి టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2జట్లు సూపర్– 4 పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుంటాయి. అక్కడ ప్రతీ జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. సూపర్– 4  పూల్ లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2 టీమ్స్  ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధిస్తాయి.