డబుల్​ బెడ్​రూం ఇండ్ల వద్ద ధర్నా

డబుల్​ బెడ్​రూం ఇండ్ల వద్ద ధర్నా

భద్రాచలం,వెలుగు : భద్రాచలంలోని మనుబోతుల చెరువులో నిర్మిస్తున్న డబుల్ బెడ్​రూం  ఇండ్ల వద్ద   ఆదివారం పేదలు  ధర్నా నిర్వహించారు. గతంలో ఈ ప్రాంతంలో గుడిసెలు నిర్మించుకున్నామని, కానీ.. తమకు ప్రభుత్వం డబుల్ బెడ్​రూం ఇండ్లు ఇస్తామని ఖాళీ చేయించిందని వాపోయారు. 

దీంతో, తాము ఇండ్లు లేక  ఇబ్బందులు పడుతున్నామన్నారు. డబ్బులిస్తేనే డబుల్ ​బెడ్​ రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ  దళారులు తమ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.   అలవాల రాజా, కొప్పు రాంబాబు, తెల్లం సమ్మక్క, మేకల లత, కుమారి, నాగమణి, సుహాసిని పాల్గొన్నారు.