సింగరేణిని దివాళా తీయిస్తున్న సర్కార్ : వాసిరెడ్డి సీతారామయ్య

సింగరేణిని దివాళా తీయిస్తున్న సర్కార్ : వాసిరెడ్డి సీతారామయ్య

కోల్​బెల్ట్, వెలుగు : కార్మికుల కష్టార్జితంతో సింగరేణి సంస్థకు వస్తున్న ఫండ్స్​ను రాష్ట్ర సర్కార్​అక్రమంగా తరలించుకుపోతోందని, దీంతో సంస్థ దివాళా తీస్తోందని ఏఐటీయూసీ జనరల్​సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సోమవారం రామకృష్ణాపూర్​లోని ఏఐటీయూసీ ఆఫీస్​లో యూనియన్​12వ మహాసభలు నిర్వహించగా సీపీఐ జాతీయ సమితి సభ్యుడు కలవేని శంకర్​తో కలిసి సీతారామయ్య చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని, సింగరేణిని కాపాడుకునేందుకు కార్మికవర్గం సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఈనెల 25, 26, 27 తేదీల్లో గోదావరిఖనిలో జరిగే యూనియన్​రాష్ట్ర మహాసభను సక్సెస్​ చేయాలని కోరారు.

సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగి ప్రజాప్రతినిధులు, గుర్తింపు సంఘం లీడర్లు పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు. టీబీజీకేఎస్​ లీడర్లు కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా పైరవీలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. అంతకు ముందు లీడర్లు, కార్యకర్తలు కార్మికవాడల్లో బైక్​ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రెసిడెంట్​ ఎండీ అక్బర్​అలీ, సీపీఐ జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్, టౌన్ ​సెక్రటరీ మిట్టపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఏఐటీయూసీ యూనియన్​ రామకృష్ణాపూర్ బ్రాంచి నూతన కమిటీని ఈ సందర్భంగా ఎన్నుకున్నారు. వైస్​ప్రెసిడెంట్ గా​ ఇప్పకాయల లింగయ్య, బ్రాంచి సెక్రటరీగా ఎం.ఆంజనేయులు, అసిస్టెంట్​ సెక్రటరీగా సురమల్ల వినయ్​కుమార్, ట్రెజరర్ గా జి.పుష్పరాజు, మైనింగ్​స్టాఫ్ ఇన్​చార్జ్​గా వంగ రాజేశ్వర్​రావును ఎన్నుకున్నారు. ​