న్యూఢిల్లీ: ఇండియా టెలికం సెక్టార్లో మోనోపోలీ లేదా డ్యూయోపోలీకి అవకాశమే ఉండదని, నిలకడైన ప్లేయర్గా ప్రభుత్వ రంగంలోని బీఎస్ఎన్ఎల్ ఎమర్జ్ అవుతోందని టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఆర్థికంగా బలహీనమైన నేపథ్యంలో దేశ టెలికం రంగంలో డ్యూయోపోలీ రానుందా అనే ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.
మోనోపోలీ (ఒకే ప్లేయర్) కి ఛాన్సేలేదంటూ, డ్యూయోపోలీ (ఇద్దరు ప్లేయర్లు) కూడా రాదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం టెలికం మార్కెట్లో ముకేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియోతోపాటు, భారతి ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు ఉన్నాయి. 5 జీ రోలవుట్లోనూ జియో పెద్ద ఆపరేటర్గా నిలుస్తోంది.