
- 10 గ్రాముల గోల్డ్, 13వేల నగదు స్వాధీనం
శాయంపేట(ఆత్మకూర్), వెలుగు: జైలు నుంచి వచ్చిన ఇద్దరు దొంగలు టీ షాపు వద్ద పరిచయమైన బాలుడికి జాబ్ ఇప్పిస్తామని చెప్పి దొంగగా మార్చారు. ఇద్దరు నిందితుల వద్ద -10 గ్రాముల గోల్డ్,13వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరకాల ఏసీపీ సతీశ్బాబు శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
తన్నిముట్టి సాయి, పాశం ప్రణిత్చోరీ కేసుల్లో జైలుకెళ్లాక ఫ్రెండ్స్ అయ్యారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన తర్వాత టీ షాపు వద్దకు వెళ్లారు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ఫస్ట్ఇయర్చదివేకరీంనగర్జిల్లా జమ్మికుంటకు చెందిన మైనర్పరిచయమయ్యాడు. అతనికి జాబ్ఇప్పిస్తామని చెప్పి నమ్మించి తీసుకెళ్లారు. ముగ్గురూ కలిసి హనుమకొండ సిటీ అంతా తిరుగుతూ జల్సాలకు, మద్యానికి అలవాటుపడ్డారు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ప్లాన్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు.
ఆత్మకూర్మండలం కటాక్షాపూర్వద్ద పోలీసు చెక్పోస్టు సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. బైక్ పై ముగ్గురూ వెళ్తండగా.. ఆపకపోవడంతో వెంబడించి పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. గత జూన్లోఆత్మకూర్మండలం గుడెప్పాడ్ రామాలయంలో రెండు బంగారు గంటెపుస్తెలు, వెండి జంజరం, రూ. వెయ్యి నగదు, దుగ్గొండి మండలం గర్నిబావిలోని వైన్షాపు గ్రీల్స్తొలగించి రూ.12వేల నగదు, మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లి ముగ్గురు ఒప్పుకున్నారు.
మైనర్తో పాటు ప్రణిత్ ను పట్టుకోగా, సాయి పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుల వద్ద రూ. వెయ్యి నగదు, బంగారు, వెండి వస్తువులను, బైక్ ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఆత్మకూరు సీఐ సంతోష్, ఎస్ఐ తిరుపతి, సతీశ్, హెడ్ కానిస్టేబుల్కుమారస్వామి, కానిస్టేబుల్శ్రీనివాస్లను ఏసీపీ అభినందించారు.