సిగరెట్లను తగలబెట్టేందుకు ఇస్తే అమ్మేశారు ..ఇద్దరిపై కేసు నమోదు చేసిన ఎస్ వోటీ పోలీసులు

సిగరెట్లను తగలబెట్టేందుకు ఇస్తే అమ్మేశారు ..ఇద్దరిపై కేసు నమోదు చేసిన ఎస్ వోటీ పోలీసులు
  • రూ. 20 లక్షల విలువైన ఈ- సిగరెట్లు, విదేశీ సిగరెట్లు స్వాధీనం  

యాదాద్రి, వెలుగు: కస్టమ్స్​ డిపార్ట్​మెంట్​  స్వాధీనం చేసుకున్న ఈ– -సిగరెట్లను కాల్చేందుకు ఇస్తే.. వాటిని  అమ్మిన ఇద్దరిపై   ఎస్ వోటీ పోలీసులు కేసు నమోదు చేశారు.  మూడు ట్రక్కుల  ఈ–-సిగరెట్లు, విదేశీ బ్రాండ్​ సిగరెట్లను శంషాబాద్​ఎయిర్​పోర్టులో కస్టమ్స్​ఆఫీసర్లు పట్టుకుని, తగలబెట్టేందుకు యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురంలోని రోమా ఇండస్ట్రీస్​కు గత జూన్​13న ఇచ్చారు. 

ఇండస్ట్రీస్​ సూపర్​ వైజర్​ పల్లె శ్రీనివాస్​..  వాటిలో370 ఈ– -సిగరెట్లు, విదేశీ బ్రాండ్ల 4,660 సిగరెట్ ​ప్యాకెట్లను అమ్మాడు.  సమాచారం తెలియడంతో ఎస్​వోటీ పోలీసులు భువనగిరిలోని ‘పాన్​ ప్యాలెస్’​లోని సయ్యద్​ షరీఫ్ ​షాప్​పై దాడి చేసి
13ఈ– -సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. షరీఫ్​ను విచారించి..  పల్లె శ్రీనివాస్​,  ఇండస్ట్రీస్ ​ఎండీ అనిల్​కుమార్ పై కేసు నమోదు చేశారు.